తెలుగు - వెలుగు ( Telugu - Velugu )

Discussion in 'Community Chit-Chat' started by mitrudu2012, Feb 21, 2013.

  1. moukthika9

    moukthika9 Gold IL'ite

    Messages:
    558
    Likes Received:
    546
    Trophy Points:
    188
    Gender:
    Female
    [​IMG]
     
    1 person likes this.
  2. moukthika9

    moukthika9 Gold IL'ite

    Messages:
    558
    Likes Received:
    546
    Trophy Points:
    188
    Gender:
    Female
    nenu share chydam goppa vishyam kadu pravaraakya,veeramaachineni........prati postni enthoo oopikka chaduvutunnaru choodandi....adi na drushtilo goppa vishayam
     
    1 person likes this.
  3. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    మౌక్తిక గారు ....
    ఇలా అనడం మీ మంచి సంస్కారానికి నిదర్శనము అండి .......
    కృతఙ్ఞతలు .........


     
  4. moukthika9

    moukthika9 Gold IL'ite

    Messages:
    558
    Likes Received:
    546
    Trophy Points:
    188
    Gender:
    Female
    [​IMG]

    నీతి --- మనిషి జీవితంలో వారి స్థితిగతులను బట్టి , వారి వారి పరిస్థితులను బట్టి పెద్ద లేదా చిన్న అపాయాలు వస్తూనే ఉంటాయి.....అలాంటి అపాయాలను ఇలాంటి చిన్న చిన్న ఉపాయాలతో ఎడుర్కున్నవారే....ఈ సంద్రంలాంటి జీవితానికి ఎదురీది ఒడ్డుకి చేరుకోగల్గుతారు:)
     
    1 person likes this.
  5. bunnipriya

    bunnipriya Gold IL'ite

    Messages:
    408
    Likes Received:
    459
    Trophy Points:
    130
    Gender:
    Female
    moukhika garu inni manchi posts meeru collect chesi post chestunnaru.. meeku chala thanks.. telugu bhasa ante vunna mee abhimanam ikkada chala baga kanipistundi..
     
    2 people like this.
  6. moukthika9

    moukthika9 Gold IL'ite

    Messages:
    558
    Likes Received:
    546
    Trophy Points:
    188
    Gender:
    Female
    బీర్బల్ కాకి లెక్కలు

    ఒక రోజు అక్బర్, బీర్బల్ వేటకి వెళ్ళారు. అడవి లో చాలా కాకులు కనిపించాయి. ఆ కాకులను చూసి అక్బర్ మహారాజుకి ఒక ఆలొచన వచ్చింది.
    సరదాగా బీర్బల్ తెలివిని పరీక్షిద్దం అనుకున్నారు. వెంటనే తన పక్కన వున్న బీర్బల్ వైపుకు తిరిగి, “బీర్బల్, మన రాజ్యంలో ఎన్ని కాకులు వున్నాయి?” అని అడిగారు.
    బీర్బల్ రెప్ప ఆర్చకుండ వెంటనే “సామ్రాట్, మన రాజ్యంలో సరిగ్గా తొంభై తొమ్మిది వేల, ఆరు వందల నలభై మూడు కాకులు వున్నాయి” అని బదులు చెప్పరు.
    ఆష్చర్య పోయిన అక్బర్ మహారాజు, “అంత కచ్చితంగా చెబుతున్నావు, అంతకన్నా ఎక్కువ కాకులుంటే?” అని అడిగారు.
    “అయితే పక్క రాజ్యాలనుంచి మన రాజ్యంలోని కాకుల చుట్టాలు వచ్చినట్టు” అన్నారు బీర్బల్.
    “ఒక వేళ తక్కువ వుంటే?” అని అడిగారు అక్బర్
    “అయితే మన రాజ్యం కాకులు వాళ్ళ చుట్టాలని కలవడానికి వెళ్ళినట్టూ!” అని చెప్పారు బీర్బల్.
    ఈ కథను ఈ రోజు వరకు బీర్బల్ తెలివితేటలకు, స్థిత ప్రగ్న్యతకు ఉదాహరణగా చెప్పుకుంటారు. నిజమే, తెలివిగా అక్బర్ మహారాజు వేశిన చిక్కు ప్రశ్నకు జవాబు చెప్పారు కద! మీరేమంటారు?
     
    Last edited: Mar 13, 2013
    2 people like this.
  7. moukthika9

    moukthika9 Gold IL'ite

    Messages:
    558
    Likes Received:
    546
    Trophy Points:
    188
    Gender:
    Female
    కృష్ణం వందే జగద్గురుమ్

    శ్రీమద్భాగవతములోని కథ

    చిన్నికృష్ణుడు గోపబాలురతో కలిసి ఎన్నో విచిత్రమైన ఆటలు ఆడేవాడు. “మీరందఱూ గోవులు నేను ఆబోతును” అంటూ ఆబోతులాగా రంకెలు వేస్తూ పరుగులెట్టేవాడు. “నేను రాజును మీరు భటులు” అంటూ అధికారం చూపుతూ వారికెన్నో పనులు చెప్పి చేయిస్తూ ఉండేవాడు. మూలమూలలా దాక్కొని దాగుడుమూతలాడే వాడు. అందఱితో కలిసి ఉయ్యాలాటలు, చేబంతులాటలు ఆడేవాడు. ఆహా! కఠోర నిష్ఠాపరులైన సంయమీద్రులకు సైతం అందని పరంధాముడు గోపబాలురతో కలిసి ఆటలాడుటకు వారెంత పుణ్యము చేసినారో!
    ఒకరోజు కన్నయ్య ఆటకని బయలుదేరాడు. ఒకానొక గోపిక ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ ఇంటి కోడలు నిద్రపోతూ ఉన్నది. బాలకృష్ణుడు వాళ్ళ ఇంట్లో ఉన్న పెరుగంతా త్రాగివేశాడు. వెళ్ళేవాడు వెళ్ళకుండా నిద్రిస్తున్న ఆ కోడలి మూతికి కొంచెం పెరుగు వ్రాసి వెళ్ళిపోయాడు. పెరుగంతా తానే తినివేసిందని భ్రమసి అత్తగారు కోడలిని కొట్టింది. ఆ అల్లరిపని లోని ఆంతర్యం గ్రహించలేక యశోదతో శ్రీకృష్ణుని గురించి ఇలా చెప్పుకుంది ఓ గొపిక
    ఆడం జని వీరల పెరుఁ
    గోడక నీ సుతుఁడు ద్రావి యొకయించుక తాఁ
    గోడలి మూఁతిం జరిమినఁ
    గోడలు మ్రుచ్చనుచు నత్త గొట్టె లతాంగీ!

    పిల్లలూ! మరి జగద్గురువైన శ్రీ కృష్ణుడు ఈ కథ ద్వారా ఏమి బోధించాలనుకున్నాడో తెలుసుకుందామా?
    ఈ సన్నివేశము జరిగిన సమయం రాత్రి కాదు. పైగా అది శ్రీకృష్ణుడు ఆటకై బయలుదేరిన సమయం కాబట్టి మనుషులు బాగా మేల్కొని ఉండి శ్రమించి తమ కర్తవ్యాలు నిర్వహించ వలసిన సమయం. అట్టి ఉపయోగకరమైన వేళలో ఆ ఇంటి కోడలు నిద్రించుట కృష్ణపరమాత్మకు నచ్చలేదు. అందుకనే ఆ విధంగా కోడలిని శిక్షించినాడు. ప్రకృతి నియమానుసరముగా లభ్యమైన సమయమును వృధా చేయకుండా నిరంతరం సత్కర్మలను చేయాలన్నదే జగద్గురువైన శ్రీకృష్ణుని సందేశం.
     
    Last edited: Mar 13, 2013
    1 person likes this.
  8. moukthika9

    moukthika9 Gold IL'ite

    Messages:
    558
    Likes Received:
    546
    Trophy Points:
    188
    Gender:
    Female
    వితరణశీలి విక్రమార్కుడు

    విక్రమార్కుని సాహసగాధలలోని కథ

    విక్రమార్కుని ధైర్యసాహసాలు దానపరోపకారగుణాలు త్యాగనిరతి పేరుప్రతిష్ఠలు దిగ్దిగంతాలకు వ్యాపించినాయి. ఒకరోజు అవంతీరాజు ఒకభట్రాజు పద్యాల ద్వారా విక్రమాదిత్యుని గుణగణాలను విన్నాడు. ఇంత నీతిమంతుడు సత్యనిష్ఠుడు గుణాగ్రగణ్యుడు లోకంలో ఉంటాడా? అని అశ్చర్యమేసింది ఆయనకు. విక్రమార్కుని మీద కించిత్ అసూయపడి “నాకు విక్రమార్కుడంత కీర్తిప్రఖ్యాతులు ఎలావస్తాయి?” అని విచారించసాగినాడు. అదే ఆలోచిస్తూ పరాకుగా ఉండటం మొదలుపెట్టాడు.
    ఒకరోజు అవంతీరాజు వద్దకు ఒక సన్యాసి వచ్చాడు. యథావిధిగా అతనిని పూజించి రాజు “స్వామి! విక్రమార్కుని గుణగణములు నేను ఒక భట్రాజు ద్వారా విన్నాను. ఆ విక్రముడంతటివాడు మీ భూమిమీదు లేడు. అట్టి యసస్సు నాకెలా వస్తుందో చెప్పండి” అని ప్రార్థించాడు. సన్యాసి “రాజా! నీకొక సూక్ష్మోపాయం చెబుతాను. హిమవన్నగర సమీపములో ఒక కాళికాలయం ఉన్నది. సిద్ధప్రదేశమైన ఆ ఆలయం వద్ద కొందరు యోగపురుషులు హోమక్రియలు చేస్తుంటారు. నీవక్కడికి వెళ్ళి పుష్కరిణిలో స్నానం చేసి శుచివై ఆలయప్రాంతంలోకి ప్రవేశించు. గుండమొకటి త్రవ్వి కాళికాదేవికై హోమముచేసి చివరికి గుండములో దూకి నిన్ను నువ్వే పూర్ణాహుతి చేసుకో. దయాసాగరులైన ఆ యోగపురుషులు నిన్ను రక్షిస్తారు. నీ సాహసానికి మెచ్చి దేవి కరుణిస్తుంది” అని హితము చెప్పాడు.
    సదాచారుడైన రాజు అటులనే చేశాడు. ప్రత్యక్షమైన కాళికాదేవితో “ప్రతిదినమూ ఏడుకోట్ల ధనం నాకు రావాలి” అని అడిగాడు. “నాయనా! ప్రతిరోజూ నీవు హోమంచేసి పూర్ణాహుతి నిచ్చినట్లయితే నీవు కోరుకున్నట్టే జరుగుతుంది” అని దేవి చెప్పి అంతర్ధానమయినది. అవంతీరాజు యోగపురుషులకు కృతజ్ఞతలు తెలిపి నగరానికి వచ్చి దేవి ఆజ్ఞానుసారం చేసి ప్రతిరోజూ ఏడుకోట్లు సంపాదించాడు. ఆ ధనముతో ఎన్నో అద్భుతమైన దానధర్మాలు చేసి దానకర్ణుడని ప్రఖ్యాతిని పొందినాడు.
    విమలుడైన విక్రమాక్రుడు అవంతీరాజు యొక్క కీర్తిని విన్నాడు. తక్షణమే హిమవత్పర్వతములోని కాళికాలయానికి వెళ్ళి స్నానముచేసి శుచి అయ్యి ఆలయములో హోమముచేసి తన శరీరాన్ని పూర్ణాహుతి చేయబోగా కాళికాదేవి ప్రత్యక్షమై వరంకోరుకోమన్నది. కైలాశశిఖరమంత ఉన్నత హృదయం కల విక్రమాదిత్యుడు ఇలా కోరినాడు “గుణవంతుడైన అవంతీరాజు తన శరీరాన్ని పూర్ణాహుతిని చేయకుండానే ఆ ధనం అతనికి వచ్చేటట్టు దానితో అతడు మరిన్ని దానధర్మాలు చేసుకునేటట్టు అనుగ్రహించు తల్లీ”. దేవి విక్రమార్కుని త్యాగనిరతి చూసి “తథాస్తు” అని ఆశీర్వదించింది.
    ఈ విషయం తెలుసుకున్న అవంతీరాజు విక్రమాదిత్యుని వద్దకు వచ్చి “రాజా! నీ వితరణశీలత అపూర్వము అద్వితీయము. నీవంటి సౌశీల్యుడైన రాజు యీ భువిలో పుట్టబోడు” అని స్తుతించి కృతజ్ఞతలను తెలుపుకొని వెళ్ళిపోయాడు.
    పిల్లలూ! మరి మనకింతటి విశాల హృదయం వితరణగుణం ఉన్నాయా?
     
    1 person likes this.
  9. moukthika9

    moukthika9 Gold IL'ite

    Messages:
    558
    Likes Received:
    546
    Trophy Points:
    188
    Gender:
    Female
  10. moukthika9

    moukthika9 Gold IL'ite

    Messages:
    558
    Likes Received:
    546
    Trophy Points:
    188
    Gender:
    Female
    [​IMG]
     
    1 person likes this.

Share This Page