కావలసిన పదార్ధాలు: బియ్యం 250 gms పెసరపప్పు 100 gms పచ్చిమిర్చి 6 ఆవాలు 1/4 tbsp జీలకర్ర 1/4 tbsp అల్లం చిన్న ముక్క కొత్తిమిర 1/2 కట్ట జీడిపప్పు 10 మిరియాలు 8 నెయ్యి 4 tbsp నూనె 2 tbsp ఉప్పు తగినంత తయారు చేయు విధానం : బియ్యం, పెసరపప్పు కలిపి శుభ్రంగా కడిగి అరగంట నీటిలో నానబెట్టాలి. వెడల్పటి గిన్నెలో నూనె, నెయ్యి కలిపి వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం వరసగా వేసి దోరగా వేగాక సరిపడినన్ని నీళు పోసి మరిగించాలి. తర్వాత బియ్యం, పప్పు, తగినంత ఉప్పు వేసి ఉడికించాలి.రంగు కావాలంటే పావు టీస్పూను పసుపు వేసుకోవచ్చు. అడుగంటకుండా కలుపుతూ మొత్తం ఉడికాక కొత్తిమిర కలిపి దింపేయాలి.