కావలసిన పదార్దాలు : పాలకూర పేస్ట్ - 200 గ్రామ్స్ బంగాళా దుంపలు - 400 గ్రామ్స్ పన్నీర్ - 100 గ్రామ్స్ సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు - 10 గ్రామ్స్ వేయించిన సెనగపిండి - 50 గ్రామ్స్ మొక్కజొన్న పిండి - 20 గ్రామ్స్ కారప్పొడి - 10 గ్రామ్స్ జీడిపప్పు ముక్కలు - 20 గ్రామ్స్ సన్నగా తరిగిన అల్లం - 10 గ్రామ్స్ బ్రెడ్ క్రంబ్స్ - 50 గ్రామ్స్ వేయించటానికి సరిపడా నూనె ఉప్పు - తగినంత తయారీ విధానం : బంగాళా దుంపలను చెక్కు తీసి తురుముకోవాలి. పన్నీర్ కూడా ముక్కలు గా కట్ చేసి పెట్టుకోవాలి. పాలకూర పేస్ట్,సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, వేయించిన సెనగపిండి, మొక్కజొన్న పిండి, కారప్పొడి, జీడిపప్పు ముక్కలు, సన్నగా తరిగిన అల్లం, బ్రెడ్ క్రంబ్స్ అన్నింటిని ఒక గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి. దానిని గుండ్రంగా ఉండలు చేసి వాటిని వడల్లాగా ఒత్తుకోవాలి. వాటిని నూనెలో వేగించి పుదినా చెట్ని, సొంటి, పెరుగు తో సర్వ్ చేయాలి. My blog-http://blossomera.blogspot.com