కావలసిన పదార్ధాలు: బియ్యం 250 gm పెసరపప్పు 100 gm పచ్చిమిర్చి 3 ఆవాలు 1/4 tsp జీలకర్ర 1/2 tsp మిరియాలు 6 కరివేపాకు 1 tsp జీడిపప్పు 6 నెయ్యి లేదా నూనె 2 tbsp ఉప్పు తగినంత తయారు చేయు విధానం : ముందుగా బియ్యం, పెసరపప్పు శుభ్రపరచి కడిగి అరగంట నానబెట్టాలి. నూనె లేదా నెయ్యి వేడి చేసి ఆవాలు ,జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు, మిరియాలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిగా వేపి మూడు గ్లాసుల నీళ్ళు పోసి తగినంత ఉప్పు వేయాలి. బియ్యం, పప్పులో నీళ్ళనీ వంపేసి మరుగుతున్న నీళ్ళలో వేసి కలపాలి. అది మొత్తం మెత్తగా ఉడికాక గరిటతో మెదిపి దింపేయాలి. MY BLOG- Blossom Era