కావలసిన పదార్థాలు: పేణి (సన్నని సేమ్యా): 1/2kg మైదా: 50 grms నెయ్యి: 250grms పంచదార: 1 kg యాలకుల పొడి : 1tsp పాలపొడి: 150grms తయారు చేయు విధానము: 1. పంచదారను ఓ గిన్నెలో వేసి 2 గ్లాసుల నీళ్లు పోసి పాకం పట్టాలి. 2. పంచదార కరిగి సన్నని తీగపాకం రాగానే మైదా, పాలపిండి వేసి ఉండలు లేకుండా కలపాలి. తర్వాత 100గ్రా నెయ్యి పాకంలో పొయ్యాలి. 3. పాకం, పిండి రెండూ బాగా కలిసిన తర్వాత, మిగతా నెయ్యి కొంచెంకొంచెంగా కలపాలి. 4. ఇప్పుడు దానికి పేణి కూడా చేర్చి పూర్తిగా కలిసేలా చేసి దించాలి. తర్వాత నెయ్యి పూసిన ప్లేట్ లో ఈ మిశ్రమాన్ని పోసి చల్లారిన తర్వాత ముక్కలుగా కోస్తే పేణి పాక్ రెడీ.